Why are Nallamala forests dangerous? - నల్లమల అడవులు ఎందుకు ప్రమాదకరం?

 

Why are Nallamala forests dangerous? - నల్లమల అడవులు ఎందుకు ప్రమాదకరం?

 
నల్లమల అడవుల్లో మనుషులు సంచరించాలంటే  ధైర్యం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ అడవి చాలా భయంకరంగా ఉంటుంది.
  • నల్లమల అడవులు గుంటూరు జిల్లాలోని గుత్తికొండలు అని ప్రాంతంలో నల్లమల అడవులు పుట్టాయి.
  • ఇవి తూర్పు కనుమల్లో ఒక భాగం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఐదు జిల్లాల్లో కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా,గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా,కడప జిల్లా వరకు విస్తరించి ఉంది.
  • నల్లమల మధ్య భూభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికి రాజీవ్ అభ్యా అరణ్యం అని పేరు పెట్టారు ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రంలో ఒకటి.
  • నల్లమల అడవి ప్రాంతంలో అటవీక తెగులు చెంచులు ఇప్పటికీ నివసిస్తున్నారు.
  • నల్లమల అడవులను నల్లమల కొండలు అని కూడా పిలుస్తారు. ఈ అడవి మొత్తం కొండలతో నిండి ఉంటుంది.
  • నల్లమల అడవి మధ్య భూభాగంలో రైలు మార్గం కూడా ఉన్నది. గుంటూరు నుంచి గుంతకల్ వరకు రైలు ప్రయాణం చేసేవారు నల్లమల అడవిని అంతో అందంగా చూడవచ్చు.
  • నల్లమల అడవి ప్రాంతంలో ఎక్కడ చూసినా కొండలు లోయలు ఎత్తైన చెట్లతో ఎంతో ఆకర్షణీయంగా కళ్ళకి ఎంతో కనువిందుగా కనిపిస్తాయి. ఈ అడవిలో పులులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.
  • ఈ అడవిలో బైరానికొండ, గుండ్ల బ్రహ్మేశ్వరం  ఉన్నాయి, వీటిని చేరుకోవాలంటే చాలా ప్రమాదకరమైన అడవి మధ్యలో ప్రయాణించవలసి ఉంటుంది.
  • నల్లమల అడవుల్లో వజ్రాలు మరియు పురాతన సంపద చాలా వరకు దాగి ఉన్నాయని ప్రచారం ప్రాచుర్యంలో వచ్చింది. అనేక జిల్లాల్లో నుంచి ప్రజలు వజ్రాల వేట కోసం ఇక్కడికి వస్తుంటారు.
  • ఆత్మకూరు నుండి నంద్యాల వరకు వెళ్లే మార్గంలో నల్ల కాలువ గ్రామానికి సమీపంలో వైయస్సార్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
  • భయంకరమైన విషయం ఏమిటంటే చాలా మందికి మూఢనమ్మకాలు నమ్మేవారు గుప్త నిధులు కోసం ఈ అడవుల్లో నరబలి చేస్తుంటారు. మనుషులను నరబలిని చేసిన ప్రదేశాలలో ఆనవాళ్లు చాలా వరకు కనిపించాయి.
  • నల్లమల అడవిలో అన్వేషణ చేసి యురేనియం ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. అక్కడ  ఉన్న యురేనియం బయటకుుతీస్తే   అక్కడ  ఉన్న జంతు జీవులు జాతులు చాలా వరకు నష్టం జరిగే ప్రమాదం ఉంది.
  • నల్లమల అడవులు లాంటి అడవులే మనకు జీవనోపాదులుగా మన రాబోయే కాలానికి నిలువ ఉంటుంది.
  • పెన్నా నది మరియు కృష్ణా నదులకు మధ్యన ఉత్తర దక్షిణ దిశగా దాదాపు 150 కిలోమీటర్ల వరకు ఈ నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి.

నల్లమల్ల అడవుల్లో జరిగిన యదార్ధ సంఘటనలు


  • కొన్ని సంవత్సరాల క్రితం శివ స్వాములు శ్రీశైలం వస్తు ఈ అడవి దారి తప్పిపోయారు అప్పటి ప్రభుత్వం వీరిని హెలికాప్టర్ ద్వారా గాలించి జాడను వీరి జాడను కనుగొన్నారు.
  • 2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రయాణిస్తూ హెలికాప్టర్ ద్వారా ఈ అటవీ ప్రాంతంలోని కుప్పకూలిపోయారు. సెప్టెంబర్ 2 2009 ఉదయం మరణించడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి మరణించిన ప్రదేశం పావురాల గుట్ట ప్రాచుర్యంలోకి వచ్చింది.
  • గుప్తనిధుల కోసం అడవుల్లోకి బయలుదేరిన చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ ప్రాణాలతో తిరిగి రాలేదు.
  • అడవి దగ్గరలో నివసించే ప్రజలు అప్పుడప్పుడు కట్టెల కోసం ఈ అడవుల్లోకి వెళ్తుంటారు ఇలా వెళ్లిన వాళ్లలో కొంతమంది క్రూర మృగాలకు బలైపోయారు.
  • అటవీ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు చాలామంది ప్రాణాలు ప్రమాదంలోకి తెచ్చుకున్నారు వారిని అటవీ రక్షణ శాఖ హెలికాప్టర్ ద్వారాను లేదా అక్కడ ఉన్న ఆఫీసర్ల ద్వారా రక్షించబడ్డారు.
  • నల్లమల అడవుల్లో ఉన్న యురేనియం ఖనిజనిక్షేపాల కోసం వెలికితీతకు ప్రయత్నాలు కూడా జరిగాయి.

నల్లమల్ల అటవీ పరివాహక ప్రాంతంలో మానవ జీవనం


ఈ ప్రాంతంలో పట్టణాలు, నగరాలు పెరగకపోవడానికి కారణం నీటి కొరత ఎక్కువగా ఉండడం. అందువల్ల ఇక్కడ జనజీవనం అత్యల్పంగా ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆటవిక తెగలు చెంచులు నివసిస్తున్నారు. నల్లమల్ల అడవుల్లో దగ్గర ప్రాంతంలో పెద్ద పట్టణం ఏదైనా ఉంది అంటే అది నంద్యాల పట్టణం అని చెప్పవచ్చు.

ప్రపంచంలో జరిగే అనేక విషయాలు, మానవులకు ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రతి రోజు మా బ్లాగ్ ని అనుసరించండి.



Post a Comment

Previous Post Next Post