నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర - NTR Biography Telugu

 నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర


నందమూరి తారక రామారావు ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. తెలుగు వారు ఎంతో అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారకరామారావు ఒక గొప్ప నటుడు మరియు ప్రజానాయకుడు. తన పేరులోని పదాలలో మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్ ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధి చెందిన వారు. ఆయన తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 100 చిత్రాల్లో నటించారు.

NTR తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. నందమూరి తారకరామారావు 1923 మే 28వ తేదీన సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా  నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు.

NTR గారికి మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హైస్కూలులో చదివారు.తరువాత  కాలేజీలో చేరారు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును  ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు గారు తన మీసాలు తీయటానికి ఇష్టపడకుండ మీసాలతోటే నటించడం వలన ఆయనకు మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు.మీసాలతోటే నటించడం వలన ఆయనకు మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు.1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తెతో వివాహం తర్వాత అతని విద్యాభ్యాసం దెబ్బతింది. పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) ని అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల నాగభూషణం, కే.పి.ఎస్.శర్మ తదితరులతో చేసినా పాపం అంటే ఎన్నో నాటకాలు ఆడారు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖనం పోటీలకు అతనికి బహుమతి కూడా వచ్చింది.

నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం


రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు.
రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.
ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే అతను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే అతను తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అందువల్ల అతను మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీసు ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాద్ గారి షావుకారు కూడా విడుదలైంది. అలా నందమూరి తారకరామారావు గారి చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. అక్కడే ఆయన ఒక చిన్న గది అద్దెకి తీసుకుని ఉంటుండేవాడు.
1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు గారి పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు, చంద్ర హారం ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయ వారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.
1956 లో విడుదలైన మాయాబజార్ లో అతను తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏబీఎన్ ప్రొడక్షన్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ ఎస్ ఈ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో అతను ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ కలిగిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని నేషనల్ ఆర్టు ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణ లో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978 లో విడుదలైన శ్రీరామపట్టాభిషేకం సినిమాను కూడా అతను దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల బాక్సాఫీసు వద్ద గొప్ప విజయాన్ని సాధించాయి.

ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవారు. నర్తనశాల సినిమా కోసం అతను కూచిపూడి నాట్యం కూడా నేర్చుకున్నారు. వృత్తిపట్ల ఎన్టీఆర్ కి ఉన్న నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూ వుంటారు, ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు.

NTR కు కు లభించిన పురస్కారాలు

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదు పొందిన ఎన్టీ రామారావు 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చరిత్రకారులు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేశారు.

1968 భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ స్వీకరించారు.

నందమూరి తారక రామారావు గారి రాజకీయ రంగ ప్రవేశం


1978లో ఆంధ్ర ప్రదేశ్లో అధికారంలో వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.
1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? అని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పారు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.
అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవారు. ఈ వ్యానును ఎన్టీఆర్ గారు చైతన్యరథం అని పిలిచేవారు.

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

ఎన్టీఆర్ పేరు మీద సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నందమూరి తారక రామారావు గురించి మరి కొన్ని ముఖ్య విషయాలు

  • NTR గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు.
  • 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు.
  • నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలొ ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
  • తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.
  • స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావు గారికే దక్కుతుంది.
  • మద్రాసులో ఉన్న ఎన్టీఆర్ నివాసానికి తిరుపతికి వచ్చిన యాత్రికులు అందరూ  వెళ్ళి NTR గారిని దర్శించుకుని వచ్చేవారు.

Post a Comment

Previous Post Next Post