ఈజిప్ట్ చరిత్ర రహస్యాలు - Mysteries of Egyptian history


ఈజిప్ట్ దేశం ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రాచీన దేశం. పురాతన ఈజిప్టు అనేది ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఒక అతి ప్రాచీన నాగరికత. నైలు నది దిగువ పరివాహప్రాంతంలో ఈ నాగరికత వెలిసింది. 

ఈజిప్ట్ లో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్లు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. ఈజిప్ట్ అధికారికంగా పిలవబడే పేరు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్, దీని వైశాల్యం సుమారు 10,10,000 చదరపు కిలోమీటర్లు.

ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ లోని అధిక జనాభా గల దేశాలలో ఈజిప్టు ముఖ్యమైనది. 7.6 కోట్ల జనాభాలో ఎక్కువ భాగం నైలు నది ఒడ్డున నివసిస్తున్నారు. ఈ నైలునది సుమారు 40 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అక్కడే వ్యవసాయానికి అనుకూలంగా సాగు భూమిని కనుగొన్నారు. ఈజిప్ట్ లో ఉన్న సహారా ఎడారిలో ప్రజలు ఎక్కువగా నివసించరు. ఈజిప్టు జనాభాలో సుమారు సగభాగం పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు.

ప్రపంచ దేశాలలో సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశాలలో ఈజిప్టు ప్రధానమైనది. ఈజిప్టు అధికారిక మొత్తం ఇస్లాం, అధికారిక భాష అరబిక్. 95 మిలియన్ల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఆఫ్రికాలో మూడవ అత్యంత జనసంఖ్య కలిగిన (నైజీరియా, ఇథియోపియా తర్వాత) దేశంగాను ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో 15వ స్థానంలో ఉంది. 2016 ఈజిప్టు దక్షిణాఫ్రికాను అధిగమించి, నైజీరియా తర్వాత ఆఫ్రికా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది.

ఈజిప్ట్ దేశం గురించి ఆశ్చర్యపోయే విషయాలు

  • ఈజిప్టు దేశ రాజధాని కైరో నగరం. ఇదే ఈజిప్ట్ లోని అతిపెద్ద నగరం కూడా. గత వెయ్యి సంవత్సరాలకు పైగా ఈజిప్టు రాజధాని గా కైరో పనిచేస్తుంది.అయితే కైరో నగరం అత్యధిక జనాభాను కలిగి భారీ రద్దీ ప్రదేశంగా మారిపోవడంతో  ప్రభుత్వ ఈ కైరో నగరానికి తూర్పున 45 కిలోమీటర్ల దూరంలో కొత్త రాజధాని నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం ఈ నగరానికి ఎటువంటి అధికారిక పేరు పెట్టలేదు.
  • ఈ దేశ డబ్బుని ఈజిప్షియన్ పౌండ్స్ అని పిలుస్తారు. వీరి యొక్క పౌండ్ వచ్చి మన ఇండియన్ కరెన్సీ లో ప్రస్తుతం 4.80 (నాలుగు రూపాయల 80 పైసలు) ఇండియన్ రుపీస్ గా ఉంది.
  •  మతం పరంగా చూస్తే ఈజిప్ట్ ఒక ముస్లిం దేశం. ఈ దేశం 90.3% ముస్లింలే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా సున్నీ ముస్లింలు ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత 9.6% క్రిస్టియన్స్ ఉన్నారు. మిగిలిన మిగిలిన 0.01% ఇతర మతాల ప్రజలు జీవిస్తున్నారు.
  • ఈజిప్టు దేశ అధికారిక భాష అరబిక్. దేశంలో ఉన్న ఎక్కువ మంది ప్రజలు అరబిక్ భాషనే ఉపయోగిస్తారు. ఆ తర్వాత స్థానంలో ఎక్కువగా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలను ఉపయోగిస్తారు.
  • ఈజిప్ట్ దేశంలో అక్షరాస్యత మిగతా దేశాలతో పోలిస్తే వెనుకబడి ఉందని చెప్పవచ్చు.
  • ఈజిప్ట్ దేశానికి మరియు భారత దేశానికి మధ్య ఉన్న సమయ వ్యత్యాసం కేవలం 3:30 నిమిషాలు మాత్రమే. అంటే ఈజిప్ట్ లో ఉదయం 9:00 అయితే తే మనదేశంలో సమయం 12:30 అవుతుంది.
  • జనాభా పరంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 14 వ దేశంగా ఈజిప్ట్ నిలిచింది.
  • ఈజిప్ట్ జెండా మూడు రంగులు కలిగిన సమాంతర చారలతో ఉంటుంది. వీటిలో ఎరుపు రంగు అనేది ఈ దేశ అమరవీరుల త్యాగాలను, రక్తాన్ని సూచిస్తుంది. తెలుపు రంగు అనేది శాంతిని సూచిస్తుంది. మూడవది నలుపు రంగు అనేది చీకటి కాలాన్ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న డేగ వీరి బలం మరియు శక్తిని సూచిస్తుంది.
  • పూర్వకాలంలో ఈజిప్టు వారు పిల్లులను పవిత్ర జంతువుగా భావించే వారు. ఈ జంతువు వారి ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని నమ్మేవారు. ప్రతి కుటుంబంలో కూడా పిల్లిని పెంపుడు జంతువుగా పెంచుకునేవారు.
  • ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది. ఇది ఈజిప్టు దేశం లోనే ఉంది. ఈ నది లేకపోయినట్లయితే ఈజిప్టు మొత్తం ఒక ఎడారిలా గా మిగిలిపోయేది. ఎందుకంటే ఇక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది.
  • మమ్మీల సమాధి తర్వాత మనం చెప్పుకోవాల్సినవి ఇక్కడ ఉన్న పిరమిడ్ల గురించి. ఈ పిరమిడ్లు అనేవి ఈజిప్టు పరిపాలించిన రాజులు మరియు వారి కుటుంబ సభ్యుల సమాధి కోసం నిర్మించబడ్డాయి. వీరు చనిపోయాక  శరీరంతోపాటు వీరి దగ్గర ఉన్న నిధిని కూడా ఇక్కడ దాచి పెట్టేవారు. ఇది వీరి మరణం తర్వాత వచ్చే జీవితంలో ఉపయోగ పడుతుందని నమ్మేవారు.
  • ఈజిప్ట్ లో ఇప్పటివరకు 130కి పైగా పిరమిడ్లను కనుగొన్నారు. పురావస్తు శాఖ వారు ఇంకా మరికొన్ని పిరమిడ్లు కనుగొనడానికి పరిశోధనలు సాగిస్తున్నారు.
  • ఇక్కడ ఉన్న అన్ని పిరమిడ్లలో గ్రేట్ పిరమిడ్ అనేది చాలా పెద్దది. దీని నిర్మాణం కోసం లక్ష మంది కూలీలు పని చేశారు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఈ పిరమిడ్ కూడా ఒకటిగా నిలిచింది.

మమ్మీ అంటే ఏమిటి? ఈజిప్టు ప్రజలు ఎందుకు చనిపోయిన వారి శరీరాలను ఎందుకు మమ్మీ ల రూపంలో భద్రపరుస్తున్నారు?


 మమ్మీ అంటే అర్థం ఒక వ్యక్తి ఏదో జంతువు అనేది చనిపోయాక వారి శరీరాన్ని కొన్ని పద్ధతుల ద్వారా భద్రపరిస్తే ఆ శవాన్ని మమ్మీ అని పిలుస్తారు. అసలు ఈజిప్షియన్లు ఎందుకు ఈ శవాలను మమ్మీ లో రూపంలో  భద్రపరిచారంటే, ఈజిప్షియన్ లో మనిషికి పునర్జన్మ ఉంటుంది అని బలంగా నమ్మేవారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ ఉండడానికి ఒక శరీరం కావాలి. అందుకే చనిపోయిన వారి శరీరాలను మమ్మీల రూపంలో భద్ర పరచడం అనేది ఆ శరీరాన్ని పాడవకుండా కాపాడుతుందని, ఆత్మ అనేది మమ్మీల రూపంలో ఉండే శరీరంలో ఉండగలదని, ఫలితంగా చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తాయని ఈజిప్షియన్లు నమ్మేవారు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మనిషి బ్రతికి ఉన్నంతకాలం  ఆత్మ అతని శరీరంలోనే ఉంటుంది.  ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల మనిషి శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది. అదే ఒకవేళ ఈ శరీరం అనేది పాడవకుండా భద్రపరచగలిగితే, ఆత్మ అనేది ఈ శరీరంలోనే ఉండగలుగుతుంది. దీని ఫలితంగా ఆత్మకు శాంతి అనేది కలుగుతుంది. ఈ విషయాన్ని పూర్విక ఈజిప్టు ప్రజలు నమ్మేవారు. అందువల్ల చనిపోయిన వారి శవాలను ఇలా మమ్మీ ల రూపంలో భద్రపరిచే ఆనవాయితి పుట్టుకొచ్చింది.

మమ్మీలను ఎలా తయారు చేస్తారు?


చనిపోయిన వ్యక్తిని మమ్మీగా తయారుచేయడానికి మొదటిగా ఆ వ్యక్తి శరీరంలోని పొట్ట నుండి ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు ఎడమవైపు నుండి తొలగించేవారు. గుండెను మాత్రం అలాగే ఉంచేవారు. ఇక తల భాగంలో మెదడు తొలగించేవారు. దీనికోసం విస్కింగ్ అనే పద్ధతి ద్వారా మెదడును ద్రవరూపంలోకి మార్చి  శరీరం నుండి వేరు చేసేవారు. మెదడు తొలగించిన ఖాళీ పుర్రెలో జిగురు నేర్పిన బట్ట పీలికలతో నింపేవారు. ఇక శవంలో ఉన్న నీటిని,తేమని పూర్తిగా తొలగించేందుకు శరీరం పై సహజమైన ఉప్పును ఉంచేవారు. ఆ తర్వాత శరీరంపై ఏర్పడిన బ్యాక్టీరియాను చంపడానికి పరిమళద్రవ్యాల పూతలు వినియోగించేవారు. ఆ తర్వాత మృతదేహంపై జిగురు లాంటి పదార్థం పూసేవారు. ఇదే అన్నిటికన్నా ముఖ్యంగా శవాన్ని పాడవకుండా కాపాడగలిగేది. ఈ జిగురు లాంటి పదార్థాన్ని ఒక రకమైన మొక్క నుంచి సేకరించిన నూనె, ఇంకొక మొక్క వేరు నుంచి సేకరించిన తైలం, తుమ్మచెట్టు జిగురు, దేవదారు వృక్షం జిగురు ఇలా వీటన్నింటిని కలపడం ద్వారా ఈ పదార్థాన్ని తయారు చేసేవారు. ఈ పదార్థానికి బ్యాక్టీరియాని ఎదిరించే శక్తి ఉండడంతో కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా శరీరం కుళ్ళి పోకుండా ఉండేందుకు, ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో గుర్తించారు. చివరగా జిగురు పదార్థం రాసిన మృతదేహానికి పెద్ద వస్త్రాన్ని చుట్టేస్తారు.
ఆ తర్వాత శరీరం గట్టిపడి ఆకారాన్ని పరిరక్షించేందుకు 15 రోజులు ఆరబెట్టే వారు. దాని తర్వాత మృతదేహం పై మరొక వస్త్రాన్ని చుట్టేవారు. ఇలా చుట్టేటప్పుడు మృతదేహంపై అనేక తాయత్తులను ఉంచి ముఖం, భుజాలు మిగతా శరీర భాగాలపై చివరిసారిగా వస్త్రాన్ని కట్టేస్తారు. ఇలా మృతదేహాన్ని మమ్మీ గా మార్చడానికి సుమారుగా 70 రోజుల సమయం పడుతుంది.

Post a Comment

Previous Post Next Post